29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

అమృత్ సరోవర్ వద్ద 

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ మోర్తాడ్:  మోర్తాడ్ మండలంలోని డొంకల్, దోన్ పాల్ గ్రామాలలో గల అమృత్ సరోవర్ వద్ద గురువారం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని డొంకల్ లోని సీనియర్ ఉపాధి హామీ కూలీ అయినటువంటి బేగారి లింగన్న మువ్వన్నెల జెండా ఎగరవేయడం జరిగింది. దొన్కల్ లోని సల్ల కుంట, దొన్ పాల్ గ్రామంలోని కుంట దగ్గర ఉపాధి కూలీల సమక్షంలో జెండా ఎగురవేసి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి స్వప్న, లక్ష్మీ దుర్గ, ఫిల్డ్ అసిస్టెంట్లు ప్రవీణ్ కుమార్, రమేష్, కరోబర్ సురేష్, అంగన్వాడీ టీచర్లు సుజాత, సుమలత, ఆశ వర్కర్లు జమున, రేణుక పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article