నిజామాబాద్ సిటి, బతుకమ్మ : ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త ఫ్లెక్సీలకు 27వ డివిజన్ బీజేవైఎం నాయకులు సుంకరి రాజశేఖర్ ఆధ్వర్యంలో యువకులు జలాభిషేకం చేశారు. ఇందూరు రైతులకు పసుపు బోర్డు హామీ నిలబెట్టుకున్న ఎంపీ అర్వింద్, నిజామాబాద్ నగర అభివృద్దికి కృషి చేస్తున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త, పసుపు బోర్డు చైర్మన్ గా నియామకమైన పల్లె గంగారెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుంకరి రంజిత్, కార్తీక్, దిలీప్, సుధాకర్ లు పాల్గొన్నారు.
