. నిజామాబాద్ కు ఫారూఖ్ హుస్సేన్
. కామారెడ్డికి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణ సాధన ఉద్యమంలో కీలకఘట్టమైన దీక్షా దివాస్ ను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన బీఆర్ఎస్ అధిష్ఠానం అందుకుకోసం జిల్లాల వారీగా ఇన్ చార్జీలను నియమించింది. నిజామాబాద్ కు మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, కామారెడ్డికి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఇన్ చార్జీలుగా వ్యవహరించనున్నారు. 2009లో కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని, అక్కడి నుంచే ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటుకు పునాదాలు పడ్డాయని బీఆర్ ఎస్ శ్రేణులు పేర్కొంటున్నాయి.
