. . . బాన్సువాడ ఎంపీడీవో ఆనంద్
బాన్సువాడ, బతుకమ్మ :
పెన్షన్ పొందేందుకు అర్హత ఉన్న వారు ఆగస్టు 15 లోగా దరఖాస్తు చేసుకోవాలని బాన్సువాడ ఎంపీడీవో ఆనంద్ అన్నారు. అర్హులైన లబ్ధిదారులు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని, అర్హులు తమ దరఖాస్తులను సంబంధిత పంచాయతీ కార్యదర్శికి లేదా మండల కార్యాలయంలో సమర్పించాలని ఆయన సూచించారు. అర్హులైన వారు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని, గడువు ముగిసిన అనంతరం దరఖాస్తుల స్వీకరణపై స్పష్టత లేకపోవడంతో అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
