నిజామాబాద్, బతుకమ్మ: రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా ఎన్ నాయక్ వాడి అపర్ణ శ్రీనివాస్ రావు పాటిల్ ను నియమించారు. ఈ సందర్భంగా ఎన్.నాయక్ వాడి అపర్ణ శ్రీనివాస్ రావు పాటిల్ మాట్లాడారు. తనపై నమ్మకంతో తన నియామకానికి కృషిచేసిన టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కలాంబ కి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు కి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ కి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, నిజామాబాద్, జగిత్యాల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బాయ్, నగర అండ్ నుడా చైర్మన్ అధ్యక్షులు కేశవేణు, జిల్లా ముఖ్య నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఆదేశాలు ఇచ్చిన సక్రమంగా నిర్వర్తిస్తానని, జిల్లాలో మహిళా కాంగ్రెస్ ని పటిష్టపరిచే విధంగా కృషి చేస్తానని తెలిపారు.

