26.3 C
Hyderabad
Monday, August 3, 2026

గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అంతరెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా అంతరెడ్డి రాజారెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య ఆయన చైర్మన్ సీటులో ఆసీనులయ్యారు. మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, మాజీ మంత్రి మండవ, సీనియర్ నాయకుడు అరికెల తదితరులు అంతరెడ్డిని అభినందించారు.

టీటీడీ కళ్యాణ మండపంలో సన్మానం

గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అంతరెడ్డి రాజారెడ్డిని కాంగ్రెస్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం సన్మానించనున్నారు. కార్యక్రమానికి ఇన్ చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు హాజరుకానున్నారు.

More articles

Latest article