28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

క్రీడా దుస్తుల వితరణ

Must read

📰 Generate e-Paper Clip

నందిపేట్, బతుకమ్మ: ఈనెల 28 శుక్రవారం నుండి 30 వరకు మైత్రి గ్రౌండ్స్ , పటాన్చెరు, మెదక్ జిల్లాలో జరిగే 44వ రాష్ట్ర స్థాయి జూనియర్ ఖో ఖో పోటీలలో నిజామాబాద్ క్రీడాకారులుపాల్గొననున్నారు. ఈ క్రీడాకారులకు బాలుర జట్టుకు శ్రీరామ ఎంటర్ప్రైజెస్ నిజామాబాద్ వారు క్రీడా దుస్తువులను అందజేశారు. అదేవిధంగా బాలికల జట్టుకి శ్రీ గీతా కాన్వెంట్ నందిపేట్ హై స్కూల్ వారు బాలికల కు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఖో ఖో అసోసియేషన్ చైర్మన్ బిల్లా అనిల్, అధ్యక్షులు జివి భూమా రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎండి అతికుల్లా, ట్రెజరర్ మధు సూదన్ రెడ్డి, గీతా కాన్వెంట్ కరస్పాండెంట్ సాగర్  తదితరులు పాల్గొన్నారు.

Sportswear distribution

More articles

Latest article