25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ వితరణ

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికలు ఉన్నత పాఠశాల పదవ తరగతి ఉర్దూ మీడియం విద్యార్థులకు ఎంఐఎం అధ్యక్షులు రజాక్, షఫీ బుధవారం ఆల్ ఇన్ వన్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విద్యార్థులు బాగా చదివి పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని సూచించారు. పదవ తరగతి పరీక్షలు 21 మార్చి నుంచి ప్రారంభమవుతున్నందున శ్రద్ధతో చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని మండల విద్యాధికారి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ,మండల విద్యాధికారి వెంకటేశం, మహమ్మద్ ఇలియాస్, మమ్మద్ ఇస్మాయిల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

All-in-one delivery for students

More articles

Latest article