జుక్కల్, బతుకమ్మ :
జుక్కల్ మండల కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి (ఏఓ) మహేశ్వరి రెండు రోజులుగా ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పెస్టిసైడ్ రిజిస్టర్, పీసీలు సరిగ్గా లేనందున అక్షయ, దత్తాత్రేయ షాపుల తాత్కాలిక లైసెన్సులను రద్దు చేసినట్లు ఏఓ తెలిపారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించినందుకు ఖండేభల్లూర్ లోని గణేశ్ ఆగ్రో ఏజెన్సితో పాటు మరో రెండు దుకాణాల తాత్కాలిక లైసెన్సులను కూడా రద్దు చేసినట్లు ఆమె వెల్లడించారు.
