వెబ్ న్యూస్, బతుకమ్మ : నటుడి రవితేజ తండ్రి రాజ గోపాల్ రాజు (90) కన్నుమూశారు. హైదరాబాద్ లోని రవితేజ నివాసంలో మంగళవారం రాత్రి రాజగోపాల్ రాజు తుదిశ్వాస విడిచారు. ఆయనకు ముగ్గురు కుమారులు కాగా, వారిలో పెద్దకుమారుడు రవితేజ, రెండో కుమారుడు భరత్ 2017లో కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మరో కుమారుడు రఘు నటుడిగా పలు సినిమాల్లో కనిపించారు. రాజగోపాల్ రాజు మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
