- మైన్స్ ఏడీ నగేష్
బాన్సువాడ, బతుకమ్మ : అనుమతులు లేకుండా మొరం తవ్వి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని మైన్స్ ఏడీ నగేష్ హెచ్చరించారు. నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామ శివారులో అక్రమంగా మొరం తవ్విన గుట్టలను పరిశీలించారు. గుట్ట తవ్వకాలు జరగకుండా గట్టినిఘా ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ ప్రవీణ్ కుమార్, ఆర్ఐ సాయిలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు…