రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని లింగంపల్లి శివాలయంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్ గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎస్సై సాయన్నతోపాటు భక్తులకు అన్నదానం చేశారు. మాజీ సర్పంచ్ ఇందూరు చంద్రశేఖర్, ఏసీపీ శ్రీనివాస్, ఎస్సై సాయన్నను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
