నిజాంసాగర్, బతుకమ్మ :నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో గల ఆదర్శ పాఠశాల విద్యార్థులు హైదరాబాద్ లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ ఎక్సహిబిషన్ లో ఉత్తమ ప్రతిభ చూపారు.విద్యార్థులు రైల్వే ఆక్సిడెంట్ నిర్మూలన, ఇన్నోవేషన్ ఛాలెంజ్ పై ప్రయోగం ప్రదర్శించారు.దీనితో స్టేట్ లెవెల్ రోబోటిక్స్ ఇన్ అకాడమిక్స్ ఆధ్వర్యంలో ట్రోఫీ , షిల్డ్ అందజేశారు.విద్యార్థులు తో పాటు గైడ్ గా వ్యవహరించిన చందన అనే ఉపాధ్యాయురాలు ను పాఠశాల ప్రిన్సిపాల్ కార్తీక సంధ్య అభినందించారు.
