హైదరాబాద్, బతుకమ్మ : ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా భూ రికార్డుల ఏడీ శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు.. హైదరాబాద్, మహబూబ్ నగర్, బాలా నగర్ ప్రాంతాల్లో ని ఆయన సోదరుడు, బంధువుల ఇళ్లలోను తనిఖీలు జరిపారు. శ్రీనివాస్ భారీ గా ఆస్తులు సంపాదించినట్లు గుర్తించారు. పలు చోట్ల షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు భావిస్తున్నారు. ఆయనకు మహబూబ్ నగర్ లో రైస్ మిల్లు ఉన్నట్లు గుర్తించారు.
