నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జిల్లా కేంద్రానికి చేరుకున్న బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులకు బీసీ సంక్షేమ్ సంఘం ఆధ్వర్యంలో మంగళహారతులతో స్వాగతం పలికారు. స్వాతంత్ర్యం రాకముందు బ్రిటీష్ హయాంలో బీసీ కుల గణన చేపట్టారని, ఆ తరువాత ఇప్పటి వరకు కుల గణన చేపట్టకపోవడం బాధాకరమని, ప్రస్తుత ప్రభుత్వం బీసీ కులగణన చేయడానికి ముందుకురావడం హర్షణీయమని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. బీసీ కమిషన్ సభ్యులకు పలు సమస్యలపై విన్నవించారు. కార్యక్రమంలో బుస్సా ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, పోల్కం గంగాకిషన్, దర్శనం దేవేందర్, కరిపె రవీందర్, భూమన్న, కొయ్యాడ శంకర్, నారాయణ రెడ్డి, శ్రీలత, హనుమంత్ రావు, చంద్రకాంత్, లక్ష్మీనారాయణ రాజు, సుదర్శన్, సాయి బసవ, దేవీదాస్ తదితరులు పాల్గొన్నారు.
