ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలో శనివారం అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేడ్కర్ వర్ధంతిని నిర్వహించారు. నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు సున్నం నరేష్ కుమార్ జగ్గ ప్రవీణ్ కుమార్ దాసరి అంజయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. ప్రతి ఒక్కరు అంబేడ్కర్ చూపి న మార్గంలో నడవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ సంఘం మాజీ అధ్యక్షులు సున్నం నరేష్ కుమార్,మాజీ సర్పంచ్ అర్పల్లి దశరథ్,మాజీ ఎంపీటీసీ మారంపల్లి సుధాకర్,యువతరం యూత్ అధ్యక్ష,ఉపాధ్యక్షులు సాయిబాబా,జెగ్గ ప్రవీణ్ కుమార్, కేపీ గంగారం, శ్రీనివాస్, సతీష్, సాయిలు , నవీన్, అంబేద్కర్ సంఘం మాజీ గౌరవ అధ్యక్షులు జెగ్గ రాములు, లోకాని గోపి,తదితరులు పాల్గొన్నారు.
