వెబ్ న్యూస్, బతుకమ్మ : ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి స్వల్ప ఊరట లభించింది. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు వద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంకా పీటీ వారెంట్లు జారీ చేయలేదని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో తదుపరి విచారణను కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
