కాకినాడ భాష్యం స్కూల్ లో చదువుతున్న యల్ల నేహాంజని ఘనత
వెబ్ న్యూస్, బతుకమ్మ : టెన్త్ పరీక్షల చరిత్రలో అరుదైన రికార్డును ఏపీకి చెందిన విద్యార్థిని నెలకొల్పింది. ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. కాకినాడలో భాష్యం స్కూల్ లో చదువుతున్న యల్ల నేహాంజని అనే విద్యార్థి పదో తరగతి పరీక్షల్లో 600కు 600 మార్కులు సాధించింది. టెన్త్ ఫలితాల్లో 600కు 600 మార్కులు సాధించడం ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు.