నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ ను నిజాంబాద్ మండల విద్యాశాఖ, సీఆర్పీలు, కంప్యూటర్ ఆపరేటర్లు , జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సభార్డినేట్స్ ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ అర్బన్ మండల విద్యాశాఖ కార్యాలయంలో ఎంఈఓ సాయి రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ సౌత్ మండల విద్యాధికారి సాయి రెడ్డి మాట్లాడుతూ విద్యాశాఖకు విశిష్ట సేవలు అందించారని, ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఇప్పటికీ నిరుపేద విద్యార్థులకు సేవలు చేస్తూ ఆదుకుంటున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్ ఏపీ నైజర్, కంప్యూటర్ ఆపరేటర్లు శ్వేత, ప్రభాకర్, సీఆర్పీలు వినూత్న, సుష్మ, అరుణ, విజయనిర్మల, సుమలత, ఆఫీస్ సభార్డినేట్స్ అప్సర్, చిన్నయ్య సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.