25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

లబ్దిదారులకు సీఎం రిలీఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ సిటి

నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పరిధిలోని అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని(చెక్కులు) అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పంపిణీ చేశారు.

శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 71 మంది లబ్ధిదారులకు చెక్ లను  పంపిణీ చేశారు. అనంతరం ధన్ పాల్ మాట్లాడుతు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తన కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న వారిలో 71 మందికి, రూ.18,19,000 రూపాయలు  విడతగా చెక్కులు వచ్చాయన్నారు. ఎలాంటి పైరవీలు లేకుండా దరఖాస్తు చేసుకునే వారు నేరుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అన్ని పత్రాలు అందజేస్తే సాధ్యమైనంత వరకు ప్రభుత్వం నుంచి, ముఖ్య మంత్రి సహాయ నిధి సాయం అందేలా తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు యేటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో వందలాది మంది పేదలకు వైద్య సేవల కోసం సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు అందించినట్లు చెప్పారు.లబ్దిదారులకు భారం కాకుండా చెక్కుల జారీ విషయంలో జాప్యం జరగకుండా అప్లై చేసుసుకున్న నెలలోపు వచ్చేల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అలాగే లబ్దిదారులకు అప్లై చేసుకున్న మొత్తంలో 50% విడుదల చేయాలనీ డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Urban MLA distributed CM relief checks to the beneficiaries

More articles

Latest article