. . . నలుగురు అరెస్ట్
సదాశివనగర్, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు సదాశివనగర్ ఎస్సై పుష్పరాజు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి సంతోష్ రెడ్డి పౌల్ట్రీ ఫామ్పై దాడి చేశారు. పేకాట ఆడుతున్న నలుగురిని పోలీసులు పట్టుకుని వారి వద్ద నుంచి రూ.2,080 నగదు, 4 మొబైల్ ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై పుష్పరాజ్ మాట్లాడుతూ జూదం చట్టరీత్యా నేరమని, ప్రజలు జూదానికి దూరంగా ఉండాలని సూచించారు. “మీ పిల్లల బంగారు భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జూదానికి తావు లేదని, జూదం ఆడేవారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.
