28.9 C
Hyderabad

వేటగాళ్ళ కరెంట్ ఉచ్చుకు బీట్ ఆఫీసర్ బలి

Must read

📰 Generate e-Paper Clip

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

జంతువుల వేటకు పెట్టిన ఉచ్చు, ఫారెస్ట్ అధికారి ప్రాణం తీసింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో తీవ్ర విషాదం నింపింది. అటవీ శాఖ బీట్ ఆఫీసర్ నవీన్ విద్యుత్ షాక్‌తో మృతి చెందిన సంఘటన బుధవారం వెలుగు లోకి వచ్చింది. సింగారం వెస్ట్ బీట్ పరిధిలో విధి నిర్వహణలో అడవి జంతువుల వేటకు ముఠా వేసిన కరెంటు ఉచ్చును గుర్తించే క్రమంలో ప్రమాదం జరిగింది. రాత్రి 9 గంటల సమయంలో సిబ్బందితో కలిసి వెళ్లిన అధికారి నవీన్ విధి నిర్వహణలో కరెంట్ షాక్ తో మృతి చెందాడు. మృతదేహాన్ని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article