జుక్కల్, బతుకమ్మ :
జుక్కల్ మండల విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన పిర్ సింగ్ నాయక్కు శనివారం కేంరాజ్ కల్లాలి గ్రామంలో ఘన సన్మానం నిర్వహించారు. పొలంబాట కార్యక్రమంలో భాగంగా కేంరాజ్ కల్లాలి గ్రామానికి వచ్చిన ఏఈ పిర్ సింగ్ నాయక్ను సర్పంచ్ భర్త కె. సాయిలు, గ్రామ కార్యదర్శి సుధీర్ శాలువాతో సత్కరించారు. అలాగే లైన్ ఇన్స్పెక్టర్లు అనిల్, సుధీర్ పూరీలను కూడా శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పంట పొలాలకు, అలాగే గ్రామ ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సేవలు అందించాలని గ్రామ ప్రతినిధులు, గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు జిలాని, విట్టల్తో పాటు గ్రామస్తులు పోల శంకర్ తదితరులు పాల్గొన్నారు.
