30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

పెళ్లి కావడం లేదని యువకుడి ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

 భిక్కనూరు , బతుకమ్మ :

పెళ్లి కా వడం లేదన్న దిగులుతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై 2 రామ్ చందర్ నాయక్ తెలిపిన సమాచారం ప్రకారం జంగంపల్లి గ్రామానికి చెందిన మాసుల సంతోష్(26) అనే యువకుడు గత కొంతకాలంగా పెళ్లి కావడం లేదని బాధపడుతూ మానసికంగా కుంగిపోయాడు. పెళ్లి సంబంధాలు రాకపోవడంతో బాధపడుతూ జీవితంపై విసుగు చెంది ఇంట్లోనే దూలంకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తమ్ముడు సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు కామారెడ్డి కి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై 2 రామ్ చందర్ నాయక్ తెలిపారు.

More articles

Latest article