ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండలంలోని వివిధ గ్రామాలలో నిర్వహించే బిఎల్ఓ ల స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన పత్రాలను స్థానిక తహసిల్దార్ బాలయ్య బుధవారం అందజేశారు. మండలంలోని 39 పోలింగ్ కేంద్రాలకు గాను 12 రకాల ఈ ఎఫ్ పారాలను సంబంధిత బి ఎల్ వో లకు అందజేయడం జరిగిందని ఆయన వివరించారు. నేటి నుండి బిఎల్వోలు ఇంటింటి సర్వే నిర్వహించి సార్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ శైలజ, రెవిన్యూ ఇన్స్పెక్టర్ గిరిధర్, ప్రవీణ్ కుమార్, జి పి ఓ లు, బిఎల్వోలు పాల్గొన్నారు.
