23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

విశ్వబ్రాహ్మణ సంఘం మండల నూతన కార్యవర్గం ఎన్నిక

Must read

📰 Generate e-Paper Clip

 

లింగంపేట, బతుకమ్మ :

 

లింగంపేట మండలం విశ్వ బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల శాఖ అధ్యక్షుడిగా కమ్మరి సిద్ధిరాములు చారి కొండాపూర్, ఉపాధ్యక్షులుగా కమ్మరి వెంకటి చారి, వడ్ల రాజు చారి, ప్రధాన కార్యదర్శిగా అవుసుల లక్ష్మణ్ చారి, కోశాధికారిగా వడ్ల రాజేందర్ చారి, కార్యదర్శిగా అవుసుల శ్రీనివాస్ చారి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ సంఘం అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని, అన్ని రంగాల్లో విశ్వబ్రాహ్మణులు ముందు ఉండేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం విశ్వకర్మ ఐక్యవేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్ల భీమయ్య చారి, వడ్ల రవికుమార్ చారి, కుమ్మరి వెంకటేశం చారి, పండరి చారి, మురళి చారి, నరహరి చారి, చంద్రశేఖర్ చారి, బ్రహ్మం చారి, ప్రభాకర్ చారి, సతీష్ చారి, గంగయ్య చారి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article