బతుకమ్మ భిక్కనూరు : భిక్కనూరు పట్టణంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఏడిఏ అపర్ణ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు వైస్ చైర్మన్ స్వామి,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఇంద్రకరణ్ రెడ్డి, సొసైటీ చైర్మన్ గంగల్లా భూమయ్య, వైస్ చైర్మన్ రాజిరెడ్డి, వ్యవసాయ అధికారిణి రాధ, తదితరులు పాల్గొన్నారు.
