ఎల్లారెడ్డి, బతుకమ్మ :
ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో గురువారం జిల్లా అంధత్వ నివారణ సంస్థ లయన్స్ హాస్పిటల్ బాన్సువాడ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 42 మందికి కంప్యూటర్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహించారు. పరీక్షించిన వారిలో 8 మందికి మోతి బిందు ఉన్నట్టు గుర్తించి వారికి ఆపరేషన్ కోసం లయన్స్ హాస్పిటల్ బాన్సువాడ కు పంపించారు. అలాగే 17 మందికి కంటి అద్దాలు సిఫారసు చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరిండెంట్ డా.రవీందర్ మోహన్, ఆర్ఎంఓ డా.శ్రీనివాస్, బి.హరి కిషన్ రావు పాల్గొన్నారు.
