హైదరాబాద్, బతుకమ్మ
తెలంగాణ నూతన డీజీపీ సీవీ ఆనంద్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసారు. మంగళవారం హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో డీజీపీగా నియమితులైన సీవీ ఆనంద్ సీఎం ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నూతన డీజీపీ కి అభినందనలు తెలియజేశారు.
