హైదరాబాద్, బతుకమ్మ :
డీజీపీ ర్యాంకు పదోన్నతి పొందిన అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఐసీసీసీలో వివి శ్రీనివాస రావు, స్వాతి లక్రా, మహేష్ భగవత్, చారు సిన్హా, డాక్టర్ అనిల్ కుమార్, వీసీ సజ్జనార్ ముఖ్యమంత్రి ని కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఉన్నారు.

