. . . అభినందించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ నుండి ఏసిపి గా పదోన్నతి పొందిన ఇన్స్ పెక్టర్ ని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు. తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఆదేశానుసారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏసిపి గా పదోన్నతి పొందిన పి.శ్రీశైలం శనివారం సీపీ ని కలిసారు. గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్నటువంటి స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ కి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు ఆఫీసర్ గా ప్రమోషన్ రావడంతో ఆఫీసర్ ఆనందం వ్యక్తం చేశారని సీపీ తెలిపారు. ఈ సందర్భంగా ప్రమోషన్ పొందిన శ్రీ శైలం కు సీపీ శుభాకాంక్షలు తెలియజేశారు.
