. . . పీఆర్ టీయూ టీఎస్ నాయకులు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
మహిళల అభివృద్ధి, సమాన హక్కులు, వారి పురోగతికి అందరం కలిసి కృషి చేయాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ టీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. పీఆర్టీయూ టీఎస్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ మేయర్ ఉమారాణి రమేష్, నుడా చైర్మన్ కేశ వేణు, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాట్పల్లి నాగేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళల సాధికారత, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర, వారి కృషి, సేవలను కొనియాడారు. అనంతరం పలువురు మహిళలను సన్మానించారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పీఆర్టీయూ టీఎస్నిజామాబాద్ ఉపాధ్యాయ సంఘం నాయకులకు, నిర్వాహకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అలాగే మహిళలందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

