26.6 C
Hyderabad
Monday, August 3, 2026

మహిళల పురోగతికి అందరం కలిసి కృషి చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పీఆర్ టీయూ టీఎస్ నాయకులు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మహిళల అభివృద్ధి, సమాన హక్కులు, వారి పురోగతికి అందరం కలిసి కృషి చేయాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ టీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. పీఆర్టీయూ టీఎస్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ మేయర్ ఉమారాణి రమేష్, నుడా చైర్మన్ కేశ వేణు, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాట్పల్లి నాగేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళల సాధికారత, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర, వారి కృషి, సేవలను కొనియాడారు. అనంతరం పలువురు మహిళలను సన్మానించారు.

 

We should all work together for the advancement of women.

 

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పీఆర్టీయూ టీఎస్నిజామాబాద్ ఉపాధ్యాయ సంఘం నాయకులకు, నిర్వాహకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అలాగే మహిళలందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

 

We should all work together for the advancement of women.

More articles

Latest article