. . . ఏఈ శ్రీనివాస్
రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలోని రాయకూర్ గ్రామ సబ్ స్టేషన్ లో విద్యుత్ మరమ్మత్తుల కారణంగా 33/11 కేవి రాయకూర్ సబ్ స్టేషన్ పరిది గ్రామాలైన రాయకూర్, రాయకూర్ క్యాంప్, సిద్దాపూర్, రాణంపల్లి, సులేమాన్ నగర్, లింగంపల్లి, చిక్కడపల్లి గ్రామాల్లలో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ ఏఈ శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున పైన తెలిపిన గ్రామాల ప్రజలు విద్యుత్ అంతరాయానికి సహకరించగలరని కోరారు.
