భీంగల్, బతుకమ్మ :
భీంగల్ సర్వ సమాజ్ కమిటీ ప్రెసిడెంట్ గా పతాని కృష్ణ ఎన్నికయ్యారు. శనివారం సర్వసమాజ్ కమిటీ లో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ప్రెసిడెంట్ గా పతాని కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ గా రఘు, క్యాషియర్ గా భూమేష్, రైటర్ గా రాజు ఎంపిక అయ్యారు. విజయం సాధించిన వీరిని పలువురు అభినందించారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. గెలుపొందిన సభ్యులు పట్టణం అభివృద్ధి కొరకు కృషి చేయాలని సూచించారు.
