నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
జి.జి. కళాశాల ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో మార్చి 12వ తేదీన “కృత్రిమ మేధతో ఆంగ్ల భాషా బోధనను మార్చడంలో అవకాశాలు, సవాళ్లు, భవిష్యత్తు మార్గాలు” అనే అంశంపై జరుపబోయే జాతీయ సదస్సు కరపత్రంను గురువారం ప్రిన్సిపల్ డా. పి. రామ్మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ డా.ఎస్.రంగరత్నం, డా.కె.వి.రమణాచారి (తె.వి.వి) సదస్సు కన్వీనర్ డా.దండు స్వామితో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ నహీదబేగం, ఐ.క్యూ.ఏ.సి. కోఆర్డినేటర్ డా.రాజేష్, కామర్స్, బి.బి.ఏ అధిపతులు డా.వినయ్ కుమార్, డా.రంజిత, ఎన్సిసి అధికారి డా.రామస్వామి, డా.ముత్తెన్న, డా.చంద్రశేఖర్, రమేష్ గౌడ్, రాహుల్, రామకృష్ణ, పూర్ణచందర్ రావు, నాగజ్యోతి, ప్రతిభ, దస్తప్ప, లావణ్య, బాలమణి, కార్యాలయ సిబ్బంది ఏఓ. రామ్ కిషన్, సూపరిండెంట్ ఉదయభాస్కర్, విద్యార్థులు, పాల్గొన్నారు.

