హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ లను నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వీరికి పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే జలవనరులపై ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో రామకృష్ణ పాల్గొన్నారు.
