ఆర్మూర్, బతుకమ్మ :
ఆలూర్ మండలం కల్లేడి గ్రామానికి చెందిన ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ యువ నాయకులు సిరికొండ సాయి ప్రధాని మోడీ పై తన అభిమానాన్ని వినూత్నంగా ప్రదర్శించాడు.ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ పట్ల ఉన్న ప్రేమను తెలియజేయడానికి సాయి తన స్వంత పొలంలో వరి ధాన్యంతో పెద్ద అక్షరాల్లో జై మోడీ, జై బీజేపీ, పీఎం కిసాన్ అని రాసి అందరి దృష్టిని ఆకర్షించాడు.ఈ సందర్భంగా సిరికొండ సాయి మాట్లాడుతూ, నరేంద్ర మోడీ నాయకత్వం మా యువతకు ప్రేరణ అని, రైతుల కోసం మోడీ చేస్తున్న సేవలే తనకు కు ఈ సంకల్పం కలిగించాయని తెలిపారు.

