హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మంగళవారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పీసీసీ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఏఐసీసీ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. డీసీసీ అధ్యక్షులు, పీసీసీ కార్యవర్గ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
