బోధన్, బతుకమ్మ: రాకాసిపేట్ ప్రాంతానికి చెందిన వృద్ధురాలు కోదండం ఎల్లమ్మ (80) గురువారం మధ్యాహ్నం సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాకుండా కనిపించకుండా పోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఆమె కుమారుడు కోదండం పోశెట్టి బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో, సీఐ వెంకట్ నారాయణ బోధన్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అదృశ్యమైన ఎల్లమ్మ ఎత్తు సుమారు 5 అడుగులు 4 అంగుళాలు, చామనచాయ రంగు, తెలుగు భాష మాట్లాడగలదు అని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎల్లమ్మ ఆచూకీ తెలిసిన వారు 8712659870, 8712659778 నంబర్లకు సమాచారాన్ని అందించాలని బోధన్ టౌన్ పోలీసులు తెలిపారు.
