25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

అశోక్ సాగర్ లో దూకి ఒకరి ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

ఎడపల్లి, బతుకమ్మ: నిజామాబాద్ నగర శివారులోని ఆశోక్ సాగర్ లో వ్యక్తి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. బోదన్ పట్టణ శివారులోని ఆచన్ పల్లికి చెందిన యూసుఫ్(60) ఆశోక్ సాగర్ లో దూకాడు. అంతకు ముందే తన సెల్ ఫోన్ ఒడ్డున పెట్టి దూకడంతో స్థానికులు ఎడపల్లి పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడ ఉన్న సెల్ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. యూసుఫ్ స్థానికంగా బావార్చీ(వంటలు చేస్తు) కుటుంబాన్ని పోషించేవారు అని తెలిసింది. అతనికి 4 గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నట్టు తెలిసింది. ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యూసుఫ్ స్థానికంగా ఆశోక్ సాగర్  చెరువులో దూకగా అతనికి ఇత రాకపోవడం, జాలర్లు వేసిన వలలో చిక్కుకుని మరణించినట్లు పోలీసులు గుర్తించారు.

One person committed suicide by jumping into Ashok Sagar

More articles

Latest article