వెబ్ న్యూస్, బతుకమ్మ: ప్రియుడి మృతదేహాన్ని ప్రియురాలు పెళ్లి చేసుకున్న ఉదంతం మహారాష్ట్రలోని నాందేడ్ లోని ఝనాగంజ్ లో అలస్యంగా వెలుగు చూసింది. తమకుమార్తె ఇతర కులం వ్యక్తిని ప్రేమించిందని, ఈవిషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని తండ్రి, సోదరుడు భావించారు. దీంతో కుమార్తె ప్రియుడిని వారు హత్య చేశారు. ప్రాణం పోయినా అతడే తన భర్త అంటూ యువతి ప్రియుడి మృతదేహాన్ని వివాహం చేసుకుంది.
