మెండోరా, బతుకమ్మ: అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని పట్టుకున్నట్లు మెండోరా ఎస్సై సుహాసిని తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం ఉదయం బుస్సాపూర్ శివారులో ఎస్సై తమ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఒక లారీ లో ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నటువంటి వ్యక్తిని పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అట్టి వ్యక్తి దేవర్ల ఎల్లయ్య మోర్తాడ్ వాసి కాళేశ్వరం నుండి ఇసుకని అక్రమ రవాణా చేసి ఆర్మూర్ చుట్టుపక్కల గ్రామాలలో విక్రయిస్తున్నట్టు తెలియజేశారు.
