లింగంపేట్, బతుకమ్మ : లింగంపేట్ మండలంలోని హాజీపూర్ తండా గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమవారం ఒక యువకుడు మృతి చెందాడు. మంభోజిపేట్ గ్రామానికి చెందిన కాశీరాం అనే వ్యక్తి కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును తన ద్విచక్ర వాహనంతో ఢీకొనడం తో తీవ్రగాయాలై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

