నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలో జరిగిన 23వ నగర మహాసభలో పి డి ఎస్ యూ నిజామాబాద్ నగర నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పి డి ఎస్ యూ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్.గౌతం కుమార్, జన్నారపు రాజేశ్వర్ తెలిపారు.అధ్యక్షులుగా సిర్రం పవన్ కుమార్,ప్రధాన కార్యదర్శి డి.సాయి కిరణ్ ,ఉపాధ్యక్షులు కే.నిఖిల్ , సహాయ కార్యదర్శి కే.మనోజ్, కోశాధికారి ప్రసాద్,కార్యవర్గ సభ్యులుగా దత్తాత్రి, ప్రసాద్,యం.భవాని , హర్షత్,కృష్ణ, ఈశ్వర్, నరేష్,కృష్ణ,ముక్త శ్రీ,లతో పాటు ఒక కో ఆప్షన్ గా 14 మందితో నూతన్ కార్యవర్గాన్ని ఏకగ్రీవ ఎన్నుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం, అసమానతలు లేని సమాజం కోసం, శాస్త్రీయ విద్య సాధనకై ఉద్యమిస్తామని నూతన కార్యవర్గం తెలిపారు.
