హైదరాబాద్, బతుకమ్మ : అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమితులైన బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి ని ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నిజామాబాద్ మాజీ జిల్లా అధ్యక్షుడు వరద బట్టు వేణు రాజ్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వేణు రాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా సుదర్శన్ రెడ్డి ని నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆయన అన్నారు.

