నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం 36 డివిజన్ మాజీ కార్పొరేటర్ ధాత్రిక రేవతి భర్త, బీఆర్ఎస్ నాయకులు పరమేశ్ తన అనుచరులతో కలిసి బీజేపీ పార్టీలో చేరారు. వారికి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పార్టీ కండువా కప్పి బిజెపి లోకి ఆహ్వానించారు.. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, నాయకులు పాల్గొన్నారు.
