మోర్తాడ్, బతుకమ్మ్: మోర్తాడ్ మండలంలోని ధర్మోరా గ్రామంలో మంగళవారం ఉచిత గాలికుంటూ నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించినట్లు పశుసంవర్ధక శాఖ వైద్యులు డాక్టర్ గౌతమ్ రాజు తెలిపారు. ఇందులో భాగంగా 72 పశువులకు (ఆవులు, గేదెలు) ఉచిత గాలికుంటు టీకాలు చేయటం జరిగిందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు ఆదెపు రాజేష్, మండల నరేందర్ , దుగ్గెన రవి, అప్క గంగారం, పశుసంవర్ధక ప్రభాకర్, ప్రభాస్ తదితరులు పాల్గొన్నారు.
