24.7 C
Hyderabad
Monday, August 3, 2026

సనాతన ధర్మస్థాపన కోసం బోర్డు ఏర్పాటు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ: సనాతన ధర్మ స్థాపన కోసం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. జిల్లా కేంద్రంలో మీడియాతో ఆయన తిరుపతి లడ్డూ కల్తీపై సమగ్ర విచారణ జరిపించాలని, కేంద్రం సైతం ఈ అంశంపై సీరియస్ గా ఉందన్నారు. తిరుమలలో ఒక్క లడ్డూ విషయంలోనేకాకుండా భక్తులు అనేక విషయాల్లో ఇబ్బందులు పడ్డారన్నారు.  హిందూ సమాజం ఐక్యతను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే..

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనేని ఎంపీ అర్వింద్ అన్నారు. కష్టపడి పని చేస్తే వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ ఎస్ కు ఓటు వేసే వారు లేరన్నారు. హైడ్రా కూల్చివేతలను సెలెక్టీవ్ గా కాకుండా సెక్యులర్ గా ఉండాలని, కులం, మతం ప్రాంతం వంటి బేధాలు చూడొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి అర్వింద్ హితవు పలికారు.

More articles

Latest article