శబరిమల,బతుకమ్మ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమల యాత్రలో పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా ఇరుముడి ధరించి పవిత్ర పదునెట్టాంబడిని(18 మెట్లు ) ఎక్కి అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆలయ అధికారులు, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు సభ్యులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు.
