రుద్రూర్, బతుకమ్మ : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దొరల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడిన యోధురాలు చాకలి ఐలమ్మ అని రజక సంఘం సభ్యులు అన్నారు. గురువారం రుద్రూర్ మండల కేంద్రంలోని రజక సంఘం భవనం వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 129 వ జయంతి వేడుకలను ఘనంగా జరుకున్నారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక, తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షులు కొత్తింటి నాగభూషణం, గ్రామ అధ్యక్షులు జనగరి జయరామ్, వీరాపురం సాయిలు, ఎలగరి నరేందర్, ఎలగరి గంగాధర్, శంకర్, బందెల భీమయ్య, రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
